మన భారత దేశం లో జరిగే అనర్దాలన్నీ ఆగి మల్లీ రామ
రాజ్యం రావాలి. రామ రాజ్యం రావాలంటే మనమే తేవాలి. ప్రతీ ఒక్కరికీ రాముడు ఆదర్శం
కావాలి. ప్రతీ ఒక్కరు రామ భక్తుడు కావాలి.
ప్రతీ ఒక్కరి హ్రుదయంలో రాముడు జన్మించాలి.యువత ఏ సినీ హీరోనొ ఆదర్శంగా తీసుకొనే
బదులుగా సాక్షాత్తు మన రామ చంద్రుడినే ఆదర్శంగా తీసుకోవాలి.
రాజ్యాన్ని పాలించే రాజులకి (నాయకులకి) ఆదర్శం రాముడు.
ఒక కొడుకుకి ఆదర్శం రాముడు.
ఒక అన్న కి ఆదర్శం రాముడు.
ఒక భక్తుడికి ఆదర్శం రాముడు.
ఒక భర్తకి
ఆదర్శం రాముడు.
ఒక
నిజాయితీ పరుడికి ఆదర్శం రాముడు.
ఒక
తల్లికి ఆదర్శం సీతమ్మ తల్లి.
భార్యా
భర్తలకు ఆదర్శం “సీతా రాములు”.
ఎన్నో
కష్టాలు వచ్చినా ఎదురించి నిలిచే ప్రతి ఒక్కరికీ ఆదర్శం “సీతా
రాములు”.
మనం
ఎలా జీవించాలో లక్షల పుస్తకాలు ప్రచురితం అవుతున్నాయి. కానీ వాటన్నింటి సారాంశం మన
“శ్రీ సీతా రాముల చరిత్రలో వుంది.కష్టాల్లో ఎలా జీవించాలో సీతా రాములు జీవించి చూపించారు.
అందుకే ప్రతి ఒక్క భక్తుడి నర నరాల్లో ,అనువు అనువులో రాముడు కొలువై వుండాలి.
– హరీష్.అర్వపల్లి